పంచాయతీ నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్నితప్పుపట్టిన ఏపీసీసీ శైలజానాథ్‌

Update: 2021-01-09 09:59 GMT

sailajanaath (file image)

ఏపీలోపంచాయతీ నోటిఫికేషన్‌ విడుదల చేయడాన్ని ఏపీసీసీ శైలజానాథ్‌ తప్పుబట్టారు. ఏ ఎన్నికల్లో అయినా పాల్గొనడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సిందన్న ఆయన రమేష్‌కుమార్‌ వ్యవహారశైలి సరిగ్గాలేదన్నారు. బీజేపీ అజెండాను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారన్న శైలజానాథ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు కరోనా అడ్డువస్తే.. మరి తిరుపతి ఉపఎన్నికకు అడ్డురాదా అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌, నిమ్మగడ్డ రమేష్‌ వ్యక్తిగత నిర్ణయాలను రాష్ట్ర ప్రజలపై రుద్దడం సరికాదన్నారు.

Tags:    

Similar News