AP Three Capital Issue: సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

Update: 2020-08-08 07:48 GMT

AP Three Capital Issue: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఆర్డీఏ బిల్లుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారానికి విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఆర్డిఏ, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లులపై ఇటీవలే గవర్నర్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి రైతులు ఈ బిల్లులపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణపై స్టేటస్ కో విధించింది. ఆగస్టు 14 లోపు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.

Tags:    

Similar News