Nara Lokesh: శిర్డీలో సాయినాథుడిని దర్శించుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ దంపతులు
Nara Lokesh: శిర్డీలోని సాయినాథుడిని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి శనివారం దర్శించుకున్నారు.
Nara Lokesh: శిర్డీలోని సాయినాథుడిని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబాకు నిర్వహించిన కాగడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
మంత్రి లోకేశ్ దంపతులకు ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికి దుశ్శాలువలతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.