పునరావాస కేంద్రాలను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

Update: 2019-08-18 14:53 GMT

గుంటూరు జిల్లాలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని పునరావస కేంద్రాలను హోంమంత్రి సుచరిత పరిశీలించారు. వరద బాధితులకు అందుతున్న సహాయంపై ఆరా తీశారు. వరద మండలాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు సుచరిత. వరద సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు హోంమంత్రి సుచరిత.  

Tags:    

Similar News