AP High Court: ఎస్‌ఈసీ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

AP High Court: MPTC, ZPTC ఎన్నికల రద్దును సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ పిటిషన్

Update: 2021-06-24 04:12 GMT

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

AP High Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు రద్దు చేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్‌ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరిపామని.. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించామని తెలిపింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని ఎస్‌ఈసీ కోరింది.

Full View


Tags:    

Similar News