ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న గ్రామ సచివాలయాల నమూనాను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. మహాత్మగాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 నుంచి..... విలేజ్ సెక్రటేరియట్ లు ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామ సచివాలయ భవనాలను సిద్ధం చేయాలంటూ ఒక నమూనాను అన్ని జిల్లాలకు పంపింది పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ. ఇప్పటికే ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లా కలెక్టర్లకు సూచించారు.