ఏపీ ముంపు ప్రాంతాల్లో గవర్నర్ ఏరియల్ సర్వే

Update: 2019-08-17 08:13 GMT

ఏపీలో ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న గవర్నర్ మార్గ మధ్యలో కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఎంత మేర నీరు విడుదల అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకోవాలనీ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.   

Tags:    

Similar News