యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి

Update: 2019-08-14 05:15 GMT

మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా సంఘం కొనసాగుతుందని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. ఇదివరకే ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. సాహితీవేత్తగా, మాజీ ఎంపీగా తెలుగు ప్రజలకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సుపరిచితులు.

Tags:    

Similar News