ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో కొత్త ఏసీబీ డీజీగా బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా జీవో జారీ చేశారు.
ఆర్పీ ఠాకూర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పనిభారం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు