మావోయిస్టుల సమస్యపై ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆర్ధికమంత్రి బుగ్గన అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సర్కార్.... కేబినెట్ సబ్కమిటీ నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటూ జీవోలో పేర్కొన్నారు. ఇక మంత్రివర్గ ఉపసంఘంలో హోం, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, ఆర్అండ్బీ మంత్రులను సభ్యులుగా నియమించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, ఉగ్ర దాడుల్లో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు పరిహారం, మావోయిస్టుల సమస్య నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం విధాన రూపకల్పన చేయనుంది.