ఎట్టకేలకు నిన్న ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది.. ఏపీ ఎంసెట్ పరీక్షలో 1వ ర్యాంక్ నుండి 35,000 మధ్య ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఈనెల 27, 28 న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇక 35, 001ర్యాంక్ నుండి 80,000 వరకు ఈ నెల 29, 30తేదీల్లో.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోనేందుకు అవకాశం కల్పించారు. విద్యార్ధులందరూ ఆగస్టు 2 లోపు వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. ఆగస్టు 2 తర్వాత వారు కేటాయించుకున్న సీట్లను సంబంధిత వెబ్సైట్లో ఉంచనున్నారు. ఆగస్ట్ 5 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి.