ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్ర బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసు బాధితులు ఘెరావ్ చేయడంతో కారు దిగి మాట్లాడిన పిల్లి సుభాష్చంద్రబోస్ నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం దళితుల వెంటే ఉంటానంటూ హామీ ఇచ్చారు. వైసీపీలో చేరినా తోట త్రిమూర్తులు తనకెప్పటికీ శత్రువే అన్నారు. అవసరమైతే శిరోముండనం కేసు బాధితులను సీఎం దగ్గరికి తీసుకెళ్తానన్న బోస్ బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటానన్నారు.