కాసేపట్లో ఎస్‌ఈసీని కలవనున్న ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్

Update: 2021-01-08 10:33 GMT

కాసేపట్లో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కలవనున్నారు. సీఎస్‌తో పాటు గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింఘాల్ కూడా సీఎస్‌ను కలవడానికి వెళ్లనున్నారు. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే లేఖ ద్వారా ద్వివేది తెలియజేయగా సీఎస్‌ స్వయంగా కలిసి పరిస్థితులను వివరించనున్నారు.

గతంలో ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య బేధాభ్రిప్రాయాలతో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఓ కొలిక్కి రాకపోగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం నుంచి సీఎస్‌ ఎస్‌ఈసీని కలవనున్నారు. దీంతో ఈ అంశంపై ఇకనైనా ఓ క్లారిటీకి వస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. 

Tags:    

Similar News