దావోస్ చేరుకున్న సీఎం జగన్...

YS Jagan - Davos Tour: పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సీఎం జగన్‌ భేటీ...

Update: 2022-05-21 02:11 GMT

దావోస్ చేరుకున్న సీఎం జగన్...

YS Jagan - Davos Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ దావోస్‌కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్‌ కేంద్రంగా జరిగే వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొంటారు.

ఈ సందర్భంగా.. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్‌ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి.

Tags:    

Similar News