విద్యుత్శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి 60 శాతం ఫీడర్లలో వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించాలని జగన్ ఆదేశించారు. అలాగే, మిగతా 40 శాతం ఫీడర్లకు 17 వందల కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఫీడర్లలో పనులు వేగవంతం చేయాలని 2020 జులై కల్లా మిగతా 40 శాతం ఫీడర్ల కింద కూడా ఉచితవిద్యుత్ను అందించాలని జగన్ ఆదేశించారు.