సాయంత్రం సీఎం జగన్ ప్రెస్‌మీట్.. కీలక ప్రకటన!?

Update: 2020-03-26 08:11 GMT
jagan

ఏపీ సీఎం జగన్‌ ప్రెస్‌మీట్‌కు సిద్ధమయ్యారు. సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. కరోనా నివారణ, లాక్‌డౌన్, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. సీఎం జగన్ మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, నగదు పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై మాట్లాడబోతున్నారని సమాచారం. అలాగే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఇబ్బందులపైనా సీఎం స్పందించే అవకాశం ఉంది.

ఏదైనా కీలక ప్రకటన ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకటన ఏమై ఉంటుంది..? ఏం ప్రకటించబోతున్నారు..? అనేదానిపై ఏపీ ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సినీ నటులు విరాళాలు ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయంపై కూడా జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే.. షూట్ ఎట్ సైట్ పరిస్థితులు తెచ్చుకోవద్దని రాష్ట్ర ప్రజలకు ఒకింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే. 

Tags:    

Similar News