సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ

* రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ

Update: 2021-02-16 08:14 GMT

AP CM Jagan Meeting (file imagea)

సీఎం జగన్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. త్వరలో రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అంశంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం వైవీ సుబ్బారెడ్డిని కలిశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపై ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలను వైవీ అడిగి తెలుసుకున్నారు.

Full View


Tags:    

Similar News