రెవిన్యూ లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీని ఆదుకోవాలని కోరుతూ సీఎం జగన్ వచ్చే నెల 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం, ఆర్ధిక శాఖ మంత్రులతో జగన్ భేటీ కానున్నారు. విభజన సమస్యలు, వెనకబడిన జిల్లాలకు అందించే ఆర్ధిక సాయం, రెవిన్యూ లోటు అంశాలపై జగన్ చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతిని కూడా కలిసే అవకాశాలున్నాయి.