ముగిసిన కేబినెట్ సమావేశం.. రాజధానిపై చర్చించిన మంత్రివర్గం

Update: 2019-12-27 08:05 GMT
ముగిసిన కేబినెట్ సమావేశం

ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. రెండు గంటల పాటు భేటి అయిన మంత్రివర్గం రాజధాని అమరావతితో పాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రాజధానిపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూడు రాజధానులపై కేబినెట్‌ భేటీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిర్ణయం ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం. దీంతో పాటు అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పురోగతి, తదుపరి చర్యల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కూడా సమావేశంలో చర్చించారు. 

Tags:    

Similar News