4న ఏపీ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

Update: 2019-08-30 05:34 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వచ్చే నెల 4న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ, అమరావతి రాజధాని ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో 19 బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ బిల్లులను ఆచరణలోకి తీసుకురావడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గం దృష్టిపెట్టిన తెలుస్తోంది. మరోవైపు అమరావతి ప్రాంత రైతులకు నేటినుంచి కౌలు చెక్కులను పంపిణి చెయ్యాలని నిర్ణయించింది. ఇందుకోసం గురువారం నిధులు కూడా సమకూరాయి. 

Tags:    

Similar News