AP Assembly Sessions: వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions: డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామిని ఎన్నుకునే అవకాశం

Update: 2022-09-19 01:40 GMT

AP Assembly Sessions: వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions: వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ డిప్యూటీ స్పీకర్‌గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నికకానున్నారు. కోన రఘుపతి రాజీనామాతో ఆ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. మూడు రాజధానుల ప్రస్తావనతో రాజకీయ చర్చకు దారితీసింది. అమరావతి రాజధానిపై రాజకీయ రగడ చోటుచేసుకుంది. రాజధానిపై విస్తృతంగా చర్చకొనసాగుతోంది. ఈరోజు జరిగే సభలో 8 కీలకమైన బిల్లులు ప్రస్తావనకు రానున్నాయి. ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు బిల్లులను సభలో ప్రతిపాదించే అవకాశం ఉంది. బిల్లులను సభలో చర్చించి సముచిత నిర్ణయంతో ఆమోదించనున్నారు.

Tags:    

Similar News