ఈ నెల 11 నుంచి బడ్జెట్‌ సమావేశాలు..సీఎం జగన్‌ నేతృత్వంలో..

Update: 2019-07-02 08:48 GMT

ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఈ నెల 12న తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ సమావేశాల షెడ్యూల్‌కు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్‌ అసెంబ్లీ సెక్రటరీకి చేరింది. అసెంబ్లీ సెక్రటరీ నుంచి గవర్నర్‌ నరసింహన్‌కు ఈ ఫైల్‌ చేరనుంది. గవర్నర్‌ ఆమోదం తర్వాత అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఈ నెల 11 నుంచి నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Tags:    

Similar News