ఏపీలో మరో వింత వ్యాధి కలకలం

* స్పృహ తప్పి పడిపోతున్న బాధితులు * పశ్చిమగోదావరి జిల్లా పూళ్లపడమర ఎస్సీ కాలనీలో బాధితులు * 14కు చేరిన బాధితుల సంఖ్య * ఇంటింటి సర్వే చేస్తున్న ఆశా వర్కర్లు

Update: 2021-01-19 03:51 GMT

ప్రతీకాత్మక చిత్రం 

పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం రేపింది. భీమడోలు మండలం పూళ్లపడమర గ్రామంలో ఏలూరు తరహాలో వింత వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. 14 మందికి పైగా అనారోగ్యం పాలవగా.. వారిలో కొందరికి ఫిట్స్‌ లక్షణాలు కన్పించడం ఆందోళనకు గురి చేస్తోంది. బాధితులు ఉన్నట్టుండి కిందపడిపోతున్నట్లు స్థానికులు తెలిపారు. వైద్యులు ఫుడ్‌ పాయిజన్‌ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ తరహా లక్షణాలతో అస్వస్థకు గురికావడం ఇటీవల తరుచుగా జరుగుతోంది.

Tags:    

Similar News