Annavaram Temple: ఈవో వివాదాస్పద నిర్ణయం.. ఇకపై వారికి అన్నప్రసాద వితరణ ఉండదు..
Annavaram Temple: భక్తులకు మాత్రమే అన్నదానం... సిబ్బందికి నో ఫుడ్ అంటున్నారు అన్నవరం దేవాలయ ఈవో.
Annavaram Temple: అన్నవరం దేవాలయ ఈవో వివాదాస్పద నిర్ణయం.. ఇకపై వారికి అన్నప్రసాద వితరణ ఉండదు..
Annavaram Temple: భక్తులకు మాత్రమే అన్నదానం... సిబ్బందికి నో ఫుడ్ అంటున్నారు అన్నవరం దేవాలయ ఈవో. భక్తులు మినహా దేవాలయంలో పనిచేసే సిబ్బంది, షాపుల నిర్వాహలకులంతా ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఈవో తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 30 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఏంటని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు దాదాపు 5వందల మంది వరకు ఉద్యోగులు, స్థానికంగా ఉండే వారు భోజనాలు చేస్తుంటారు. ఇప్పుడు ఈవో తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులకు మాత్రమే అన్నదానం చేయనున్నారు.