ప్రకాశం జిల్లాలో ఒక్కరోజులో 11 కరోనా కేసులు నమోదు
కరోనా కట్టడికి 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
కరోనా కట్టడికి 21 రోజుల లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.. ఇక ఏపీ విషయానికి వచ్చేసరికి ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కేసులు నమోదు కావడం గమనార్హం..
ఇక గుంటూరులో 2, తూర్పు గోదావరి జిల్లాలో 1, కడప జిల్లాలో 1 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 363కి పెరిగింది. రాష్ట్రంలో ఇవాళ రెండు మరణాలు కూడా సంభవించాయి. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6కి పెరిగింది. కరోనా నుంచి కోలుకుని 10 మంది డిశ్చార్జి అయ్యారు.
#CovidUpdates: రాష్ట్రంలో ఈరోజు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో ప్రకాశం లో 11, గుంటూరు లో 2 , తూర్పు గోదావరి మరియు కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 15 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 363 కి పెరిగింది#ApFightsCorona #CovidPandemic pic.twitter.com/o0dkFgngra
— ArogyaAndhra (@ArogyaAndhra) April 9, 2020