పెద్ద మనసు చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని!
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక దీని పై మరింత అవగాహన కల్పించేందుకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా వైయస్ఆర్ సీపీ నేత, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని కరోనా వైరస్ పై మున్సిపాలిటీ తరఫున ప్రచారం చేపట్టారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఇక అదే సమయంలో ఓ రిక్షాతో అటువైపుగా వస్తున్న ఓ వృద్ధుని గమనించిన ఎమ్మెల్యే అతడి వద్దకు వెళ్లారు. పెద్దాయన ఈ వయసులో నీకేంటి ఈ కష్టం అని ప్రశ్నించారు. ఆ రిక్షా వాలా పొట్ట కూటికోసమేనమ్మా.. అంటూ చేతులు జోడించి సమాధానం చెప్పాడు. దీనితో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రజిని నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుంది. కరోనాపై కట్టడి అయ్యాక నువ్వు బయటకు రా. అప్పటి వరకు ఈ రిక్షాను వదిలేయ్ అంటూ చెప్పుకొచ్చారు..
అంతేకాకుండా ఆ వృద్ధుడి చేతిలో కొంత నగదును అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నగదు తీసుకెళ్లి ప్రభుత్వం చెప్పే వరకు బయటకు రాకుండా ఇంటిలోనే ఉండాలని సూచించారు. అంతటితో ఆగకుండా కూరగాయల ప్యాకెట్, మాస్కు కూడా అందజేశారు. దీనితో ఆ వృద్ధుడు సంతోషంతో ముందుకు సాగాడు.. ఎమ్మెల్యే రజిని చేసిన ఈ సహాయానికి అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తుంది.