Andhra Pradesh: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్‌ఈసీ

Andhra Pradesh: పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

Update: 2021-04-03 10:11 GMT

Andhra Pradesh: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్‌ఈసీ

Andhra Pradesh: పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారమే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని అఫిడవిట్‌ లో పేర్కొంది ఎన్నికల కమిషన్. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని కోర్టుకు వివరించింది. ఇక నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న ఎస్‌ఈసీ రిట్ అప్పిల్స్‌ను డిస్మిస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది ఎస్‌ఈసీ.

Tags:    

Similar News