Minister Perni Nani: ఎల్లుండి జరిగే భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వ మద్దతు

* మద్దతు ఉంటుందని మంత్రి పేర్ని నాని వెల్లడి * రేపు రాత్రి 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 1గంట వరకు బస్సులు బంద్‌

Update: 2021-09-25 15:30 GMT

ఎల్లుండి జరిగే భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వ మద్దతు (ఫోటో: ది హన్స్ ఇండియా)

AP Government: ఎల్లుండి జరిగే భారత్‌ బంద్‌కు తమ ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటుందని మంత్రి పేర్నినాని వెల్లడించారు. రేపు రాత్రి 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, వ్యవసాయ చట్టాలపై నిరసనకు తమ ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు. అయితే ప్రజలంతా శాంతియుతంగా బంద్‌ పాటించాలని మంత్రి పేర్ని నాని కోరారు.

Tags:    

Similar News