Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Update: 2019-12-30 09:02 GMT

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్లని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నూతన డీపీఆర్ సిద్ధం చేసేందుకు కొత్త కన్సెల్టెంట్‌కు బాధ్యతలు అప్పగించింది. ఓపెన్ టెండర్ ద్వారా విశాఖ మెట్రోకు కొత్త టెండర్ల ఆహ్వానానికి నిర్ణయం తీసుకుంది. మరోవైపు టెండర్ల ప్రక్రియ నిర్వహణకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

Tags:    

Similar News