అమెరికా అబ్బాయి.. ఆంధ్రా అమ్మాయి ఒక్కటయ్యారు. చిత్తూరుకు చెందిన శ్రీనిరీషా అమెరికాలోని మిగిషాన్ యూనివర్శిటీలో చదువుతోంది. సహచర విద్యార్థి గ్రైనర్ తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దాంతో పెళ్ళిచేయాలని శ్రీనిరీషా ఇంట్లో వారితో చెప్పగా మొదట ససేమీరా వద్దన్నారు. అయితే బలవంతంగా తల్లిదండ్రులను శ్రీనిరీషా ఒప్పించింది. పెళ్ళికి ఒప్పుకున్నా పెళ్లి మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం జరగాలని షరతు విధించారు కుటుంబసభ్యులు. దాంతో గురువారం వేదమంత్రాల సాక్షిగా సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి జరిగింది. అమెరికాలో ఉన్న వరుడు కుటుంబసభ్యులు పెళ్లి తంతు కోసం చిత్తూరుకు వచ్చారు.