అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన, ఆయన కుమారుడు శ్రీహర్ష వైసీపీలో చేరారు. జగన్ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరి కేవలం నాలుగేరోజులున్న ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.
రాజీనామా చేసే సమయంలో చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీల మధ్య రాజకీయ ఒప్పందం ఉందని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టు పవన్ వింటున్నారని అన్నారు.