అసెంబ్లీలో టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భావోద్వేగానికి లోనయ్యారు. మద్యం పాలసీపై అసెంబ్లీలో మాట్లాడే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. మద్యం గురించి మీకెందుకని మీరు కూడా అంటున్నారని స్పీకర్ను ఉద్దేశించి భవానీ వ్యాఖ్యానించారు. మద్యంపై తాను అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి తనపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు ఎమ్మెల్యే భవానీ. 'దిశ చట్టం నా నుంచే మొదలు కావాలని అసెంబ్లీ సాక్షిగా' నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని భవానీ అన్నారు. దీనిపై వైసీపీ నాయకురాలు హోంమంత్రి సుచరిత స్పందిస్తూ టీడీపీ ఎమ్మెల్యే భవానీపై సోషల్ మీడియాలో పెట్టిన నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.