ఏపీ విభజన చట్టంపై ముగిసిన కేంద్రహోంశాఖ సమావేశం

Update: 2019-10-09 15:31 GMT

ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రహోంశాఖ సమావేశం నిర్వహించిన సమావేశం ముగిసింది. హోంశాఖ కార్యదర్శి అజయ్ భళ్ల నేతృత్వంలో రెండున్నర గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో.. ముఖ్యంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సింగరేణి, ఆర్టీసీ, సివిల్ సప్లైస్ తో పాటు.. వివిధ కార్పొరేషన్ల విభజనపై రెండు రాష్ట్రాల అధికారులు లేవనెత్తిన అంశాలపై హోంశాఖ వివరణ కోరింది. ఇటు ఢిల్లీలోని ఏపీ భవన్ ను ప్రస్తుతం రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయని ప్రధాన కార్యదర్శులు వెల్లడించారు. అయితే దీనిపై చర్చ ముందుకు జరగలేదు. మరోవైపు సమావేశంపై రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సంతృప్తి వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News