చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు తిరుపతి- చెన్నై రహదారిపై తనిఖీలు నిర్వహించారు పోలీసులు. తెల్లవారుజామున అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న రెండు కార్లు, 12 ఎర్రచందనం దుంగలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన ఆరుగురిలో ఒకరు పరారీకాగా ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. స్మగ్లర్లకు ఓ ఆర్మీజవాన్ సహకరిస్తూ పట్టుబడటం విశేషం.