Visakhapatnam: విశాఖలో 20 పాజిటివ్ కేసులు... అధికారులు అప్రమత్తం

విశాఖపట్నం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఇరవైకి చేరాయి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.

Update: 2020-04-10 02:11 GMT

విశాఖపట్నం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఇరవైకి చేరాయి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. అత్యంత సున్నిత ప్రాంతాల్లో పటిష్ట లాక్​డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు వెళ్లే మార్గాలను బారికేడ్లు పెట్టి మూసివేశారు. పోలీసుల పహారా కొనసాగుతోంది.

అక్కయ్యపాలెం సమీపంలోనే 5 కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్​జోన్ పరిధి 3 కిలోమీటర్లు పెంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కయ్యపాలెంలో డీసీపీ రంగారెడ్డి, జోనల్ కమిషనర్ సింహాచలం, అర్బన్ తహసీల్దారు జ్ఞానవేణి, ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణ చేస్తున్నారు.

Tags:    

Similar News