ఏపీలో 17 మంది ఐపీఎస్‌ల బదిలీ

Update: 2020-06-13 06:47 GMT

ఏపీలో ఐపీఎస్‌లు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 17మందికి స్థానచలనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌ఫర్ అయిన వారిలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఉన్నారు.

అధికారుల బదిలీకి సంబంధించిన వివరాలు..

రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు

విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా బి.శ్రీనివాసులు

ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం

రోడ్‌ సేఫ్టీ ఏడీజీపీగా కృపానంద్‌ త్రిపాఠి ఉజాలా

ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా పి.హెచ్‌.డి.రామకృష్ణ

గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి

శ్రీకాకుళం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌

డీజీపీ ఆఫీస్‌ అడ్మిన్‌ ఏఐజీగా బి.ఉదయ్‌ భాస్కర్‌

విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి

ఎస్‌ఐబీ ఎస్పీగా అట్టాడా బాబూజీ

విశాఖ గ్రామీణ ఎస్పీగా బి.కృష్ణారావు

విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్‌.విజయారావు

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా నారాయణ నాయక్‌

సీఐడీ ఎస్పీగా నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌

గుంటూరు గ్రామీణ ఎస్పీగా విశాల్‌ గున్నీ

డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్‌.రంగారెడ్డికి ఆదేశాలు

దిశ ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికను డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్‌పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags:    

Similar News