పెళ్లి మండపంలో బాంబ్ పెట్టినట్టు ఫోన్ కాల్.. చివరకు..

Update: 2019-08-15 07:01 GMT

చిత్తూరు జిల్లాలో బాంబ్ కలకలం రేగింది. పెళ్లి వేడుక జరుగుతుండగా సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది. దాంతో బంధువులంతా ఎక్కడికక్కడ పరుగులు తీశారు. సత్యవేడు విఎంకే కళ్యాణ మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండపంలో గురువారం మాజీ ఎంపీపీ మస్తాన్‌ పెళ్లి జరుగుతోంది. అయితే హఠాత్తుగా మండపంలో బాంబు పెట్టినట్టు పోలీసులకు కాల్ వెళ్ళింది. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ను తీసుకొని మండపానికి వచ్చారు. దాంతో గందరగోళం నెలకొంది. ఈ విషయం మొత్తం పాకింది.. దాంతో బంధువులంతా పరుగులు తీశారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలించగా బాంబు కనిపించలేదు. ఓ వైపు స్వాతంత్ర్యదినోత్స వేడుకలు జరుగుతున్న సమయంలో బాంబు పెట్టినట్టు కాల్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎవరైనా విద్రోహులు దాడులకు పాల్పడబోతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంతో సత్యవేడు ఉలిక్కిపడింది. 

Tags:    

Similar News