కళ్యాణదుర్గం ప్రాంతంలో అఘోరాల సంచారం

Update: 2019-08-15 02:46 GMT

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అఘోరాలు సంచరిస్తున్నట్టు ప్రజలు గుర్తించారు. కళ్యాణదుర్గం లక్ష్మినరసింహస్వామి, రామస్వామి, అక్కమాంబ, ముదిగల్లు సమీపంలోని రామప్పకొండ, ఆంజనేయస్వామి, తదితర ఆలయాల సమీపంలో అఘోరాలు సంచరిస్తున్నట్లు వాట్సప్ లో ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై పోలీసులకు మాత్రం ఎటువంటి సమాచారం లేనందువలన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో అఘోరాలు తిరుగుతున్నట్టు ఫేస్ బుక్ , వాట్సాప్ లో ఫోటోలు వైరల్ గా మారాయి.. దాంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా అఘోరాలతో భయపడాల్సిన అవసరం లేదని కొందరు స్వామీజీలు అక్కడి ప్రజలకు సూచిస్తున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News