Gudur: నారాయణమ్మ చిత్రపటానికి మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాళి

Gudur: గూడూరు మండలం బొద్దుగొండలో బీఆర్‌ఎస్ నేత ముక్క లక్ష్మణరావు తల్లి నారాయణమ్మ చిత్రపటానికి మాజీ ఎంపీ మాలోత్ కవిత, హరిత కటికనేని నివాళులర్పించారు.

B NARASIMHA, GUDUR
Published on: 20 Sept 2026 4:11 PM IST
Gudur
X

Gudur: నారాయణమ్మ చిత్రపటానికి మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాళి

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ముక్క లక్ష్మణరావు గారి తల్లి ముక్క నారాయణమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత మాలోత్, ప్రముఖ నాయకురాలు హరిత కటికనేని బొద్దుగొండ గ్రామంలోని ముక్క లక్ష్మణరావు నివాసానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా వారు ముక్క నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పార్కల శ్రీనివాస్ రెడ్డి, రావుల రవిచందర్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, మహబూబ్ పాషా, గజ్జి యాకయ్యతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR