Warangal: అర్షనపల్లిలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ నిర్వహణ!

Warangal: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లిలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ.. పాల్గొని అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

Narender, Staff Reporter  -Warangal
Published on: 19 Sept 2026 4:22 PM IST
Warangal
X

Warangal: అర్షనపల్లిలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ నిర్వహణ!

Warangal: నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో భూభారతి రీ-సర్వేపై నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి రీ-సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు, సర్వే సమయంలో భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీ-సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

రీ-సర్వే ప్రక్రియలో గ్రామస్థులు సహకరించాలని, తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. భూ వివరాల్లో ఏవైనా తేడాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామ సభలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఏడి సర్వే మరియు రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, నల్లబెల్లి తహసిల్దార్ కృష్ణా ,ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.