Anakapalle: సీఎం రమేష్పై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో రాజకీయ వేడి!
Anakapalle: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో జిల్లాలో వేడెక్కిన రాజకీయ వాతావరణం కూటమి వర్గాల్లో చర్చ.
Anakapalle: సీఎం రమేష్పై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో రాజకీయ వేడి!
Anakapalle: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్పై మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ చర్చకు దారితీశాయి. ఇటీవల ఇరువురు నేతల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల విజయానికి సీఎం రమేష్ కీలకంగా పనిచేశారని, పలువురు అభ్యర్థులకు రాజకీయంగా మద్దతు అందించారని కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంపీగా ఎన్నికైన అనంతరం అనకాపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, పరిశ్రమలు, రహదారులు, రైల్వే తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలు ప్రతిపాదనలు తీసుకెళ్లినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే పలు పారిశ్రామిక పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు కొనసాగుతున్న నేపథ్యంలో వాటి సాధనలో ఎవరి పాత్ర ఎంత అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎంపీ సీఎం రమేష్పై మాజీ ప్రజాప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై అనకాపల్లి జిల్లా కూటమి ఇన్చార్జ్లు స్పందించకపోవడంపై కూటమి వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. విమర్శలు వచ్చిన సందర్భంలో కూటమి నేతలు తమ అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే రాజకీయ విమర్శలు వ్యక్తిగత వ్యాఖ్యల స్థాయికి వెళ్లకుండా అభివృద్ధి, ప్రజా సమస్యలు, విధానాలపై చర్చ జరగాలని మరికొందరు సూచిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అనకాపల్లి రాజకీయాల్లో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.




