KCR: కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై దృష్టిసారించిన రెవెన్యూ యంత్రాంగం.. వివరాలు సేకరిస్తున్న అధికారులు!
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం భూముల వివరాలపై రెవెన్యూ అధికారుల కసరత్తు.
KCR: కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై దృష్టిసారించిన రెవెన్యూ యంత్రాంగం.. వివరాలు సేకరిస్తున్న అధికారులు!
KCR: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు, గతంలో ఆ భూములు కలిగి ఉన్న రైతుల పేర్లు, ప్రస్తుత రికార్డులను సేకరించి ప్రత్యేక నివేదిక రూపంలో అధికారులు తయారు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్ ఫామ్హౌస్పై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, రెవెన్యూ యంత్రాంగం ఈ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
అసెంబ్లీలో జరిగిన చర్చల అనుగుణంగా కేసీఆర్ ఫామ్హౌస్ భూములకు సంబంధించి పూర్తి స్థాయి నిజానిజాలను వెలికితీసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. ప్రభుత్వ భూములు ఏమైనా దీని పరిధిలో ఉన్నాయా అనే కోణంలోనూ, రికార్డుల్లో ఉన్న పేర్ల ఆధారంగా పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.




