Rajole: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిసిన వీఆర్‌ఏలు!

Rajole: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన వీఆర్‌ఏలు. పే స్కేల్ అమలు, నామినీలను గుర్తించాలని డిమాండ్.

PRABHU, RAZOLE
Published on: 19 Sept 2026 12:34 PM IST
Rajole
X

Rajole: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిసిన వీఆర్‌ఏలు!

Rajole: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న వీఆర్‌ఏల సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఏలు కోరారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాలకు చెందిన వీఆర్‌ఏలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు, డిమాండ్లపై వినతిపత్రం సమర్పించారు.

వీఆర్‌ఏలకు పే స్కేల్‌ను వెంటనే అమలు చేయాలని, నామిని వీఆర్‌ఏలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. గ్రామస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో వీఆర్‌ఏల పాత్ర కీలకమని, తమ సమస్యలు పరిష్కారమైతే మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవలందించగలమని వారు తెలిపారు.

వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ ఇచ్చినట్లు వీఆర్‌ఏలు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో తమ సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

వీఆర్‌ఏల సమస్యలపై అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వీఆర్‌ఏలకు న్యాయం జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరుతాయని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు దారపురెడ్డి వీరభద్రం, ఉపాధ్యక్షులు ఎం. సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు కె. త్రినాథ్, యు. అంజలరావు, నాలుగు మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE