Rajamahendravaram: మధురపూడి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం!

Rajamahendravaram: రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 20 Sept 2026 7:13 PM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: మధురపూడి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం!

Rajamahendravaram: కాకినాడలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘భారతీయం’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం కాకినాడలో జరగనున్న భారతీయం కార్యక్రమానికి మంత్రి లోకేష్ తో కలిసి బయలుదేరారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY