Nellore: కార్పొరేషన్ ఆఫీస్ లో కమిషనర్ వై.ఓ.నందన్ హై-లెవెల్ సమీక్ష!

Nellore: నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వై.ఓ.నందన్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, ఎల్ అండ్ టీ ప్రతినిధులతో 7 జోన్ల తాగునీటి సరఫరా పనులపై సమీక్ష జరిగింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 July 2026 7:32 PM IST
Nellore
X

Nellore: కార్పొరేషన్ ఆఫీస్ లో కమిషనర్ వై.ఓ.నందన్ హై-లెవెల్ సమీక్ష!

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ గురువారం కార్యాలయంలోని తన ఛాంబర్ లో నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మెగా సప్లై ద్వారా త్రాగునీరు సరఫరా పనులు వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే జోనల్ సిస్టం ద్వారా వాటర్ సప్లై జరిగేలా చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త మెగా లైన్స్ ద్వారా వాటర్ సప్లై 7 జోన్ లలో సరఫరా అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మెగా, ఎల్ & టి ప్రతినిధులు, నగరపాలక సంస్థ ఎస్.ఈ రహంతు జానీ, పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ మహేష్, నగరపాలక సంస్థ ఈ.ఈ. లు అనిల్ కుమార్, చంద్రయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు రఘురాం, ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ గిరిధర్, డి.ఈ.ఈ. జానకిరామ్ పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story