Bhuvanagiri: రామన్నపేటలో నీటి గుంతల్లో కూర్చొని సర్పంచుల వినూత్న నిరసన

Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట-పల్లెపహాడ్ రోడ్డు గుంతలను పూడ్చాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సర్పంచులు నీటి గుంతల్లో కూర్చొని నిరసన తెలిపారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 20 Sept 2026 9:35 PM IST
Bhuvanagiri
X

Bhuvanagiri: రామన్నపేటలో నీటి గుంతల్లో కూర్చొని సర్పంచుల వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట-పల్లెపహాడ్ వరకు అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలకుకారణమవుతున్న రోడ్డు గుంతలను పుడ్చాలని CPM ఆధ్వర్యంలో దుబ్బాక, మునిపంపుల గ్రామ సర్పంచులు గట్టు నర్సింహా, బొడ్డుపల్లి వెంకటేశం రోడ్డుపై నిలిచిన నీటి గుంతల్లో కూర్చొని వినూత్న నిరసన చేపట్టడం జరిగింది.

రొడ్డంతా ధ్వంసం అయ్యి ప్రయాణాలు నరక కుపంగా మారుతున్నా తట్టేడు మట్టి పొసే స్థితిలో లేని R&B అధికారులు,నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న అధికార యంత్రాంగం తీరును నిరసిస్తూ దుబ్బాక గ్రామంలో ప్రజలతో ఆందోళన చేపట్టిన సిపిఎం...

ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రేస్ ప్రభుత్వం ప్రజల సమస్యపై చోద్యం చూడటం సిగ్గు చేటు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, వెంటనే సమస్య పరిష్కరించాలి లేకపోతే ప్రజలను కదిలించి జిల్లా కలక్టరేట్ ముట్టడి చేస్తాం మునిపంపుల, దుబ్బాక సర్పంచులు బొడ్డుపల్లి వేంకటేశం, గట్టు నర్సింహా.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA