Gadwal: గ్యాస్ సిలిండర్ లీకేజీతో గుడిసె బూడిద.. రోడ్డున పడ్డ కుటుంబం!

Gadwal: గద్వాల పట్టణం దౌదర్‌పల్లిలో ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైంది. రూ. 1.50 లక్షల నగదు, బంగారం, వస్తువులు కాలిబూడిదయ్యాయి.

GOKARANNA,  GADWAL
Published on: 25 Aug 2026 9:42 PM IST
Gadwal
X

Gadwal: గ్యాస్ సిలిండర్ లీకేజీతో గుడిసె బూడిద.. రోడ్డున పడ్డ కుటుంబం!

గద్వాల: లక్షా యాభై వేల‌ రూపాయలు, తులం బంగారు ఆభరణాలు, వంట సామాగ్రి, దుస్తులు, ఇతర సామాగ్రి కాలిబూడిదైనట్లు బాదితుడు వాపోయారు. గద్వాల పట్టణం దౌదర్‌పల్లికి చెందిన జమ్ములమ్మ కృష్ణారావు పూరిగుడిసె ప్రమాదవశాత్తు సిలిండ్ నుంచి మంటలు వ్యాపించి, గుడిసెకు మంటలు అంటుకుని అగ్నికి ఆహుతి అయింది.

గుడిసెలోని రూ.లక్షా యాబై వేల రూ" తులంన్నర బంగారం ఆభరణాలు,‌బియ్యం, బట్టలు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం ఉన్న నివాసం కోల్పోయి రోడ్డున పడింది. ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వార్డు కౌన్సిలర్ జగదీష్ కోరారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story