Giddalur: గిద్దలూరులో 'ఇంటింటికి కామూరి కుటుంబం' ప్రారంభం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులో 'ఇంటింటికి కామూరి కుటుంబం' కార్యక్రమం ప్రారంభం.. జగనన్నను మళ్లీ సీఎం చేసుకునే వరకు విశ్రమించం కామూరి రమణారెడ్డి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 Sept 2026 7:33 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో 'ఇంటింటికి కామూరి కుటుంబం' ప్రారంభం!

Giddalur: సొంత పార్టీ నేతలే జనసేనలోకి వెళ్తున్నామని ప్రచారం చేసిన తాము జగనన్న కోసం జగనన్నను సీఎం గా చేసుకునేందుకు కోసం పనిచేస్తున్నామని మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసిపి నేత కామూరి రమణారెడ్డి అన్నారు. 2029 ఎన్నికలలో మళ్ళీ సీఎంగా జగనన్న చేసుకునేందుకు ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమాన్ని రమణారెడ్డి ప్రారంభించారు.

జగనన్న ఆశీస్సులతో పది సంవత్సరాలపాటు మా కుటుంబాన్ని ఆదరించిన ప్రతి కార్యకర్తకు ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అంటే సీఎంగా జగనన్న సమయంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని ఎంపీపీ అమూల్య వెల్లడించారు.

తమ కుటుంబాన్ని ఇన్ని ఇబ్బందులు పెట్టిన జగనన్న కోసం ఆయన ఆశీస్సులతో పని చేశామన్నారు. మళ్లీ సీఎంగా జగనన్న చేసుకునే వరకు ఉపక్రమించేది లేదని కామూరి రమణారెడ్డి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి పలకరించి జగనన్నను గెలిపించుకోవాలని కోరుతామని రమణారెడ్డి అన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU