Markapuram: వెలిగొండ ప్రాజెక్టును తనిఖీ చేసిన కలెక్టర్ విజయ సునీత
Markapuram: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును మార్కాపురం కలెక్టర్ విజయ సునీత తనిఖీ చేశారు. నల్లమల సాగర్లో ప్రస్తుతం 6 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.
Markapuram: వెలిగొండ ప్రాజెక్టును తనిఖీ చేసిన కలెక్టర్ విజయ సునీత
Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నేడు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి, నీటి నిల్వలు మరియు ప్రాజెక్టును సమగ్రంగా పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ జలహారతి వ్యూ పాయింట్ను సందర్శించడంతో పాటు, టన్నెల్-2 ఎగ్జిట్ పాయింట్ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు తాజా వివరాలను కలెక్టర్ వెల్లడించారు:
నీటి నిల్వ వివరాలు:
ఆదివారం ఉదయం 8:00 గంటల సమయానికి నల్లమల సాగర్ జలాశయంలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.
నీటిమట్టం:
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 243.8 మీటర్లుగా నమోదు కాగా, క్రాస్ రెగ్యులేటర్ వద్ద 4.05 కిలోమీటర్ల మేర నీటిమట్టం ఉందని పేర్కొన్నారు.
నీటి రాక (ఇన్ ఫ్లో):
నేడు శ్రీశైలం ప్రాజెక్టు నుండి నల్లమల సాగర్కు 2,100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు.
ప్రాజెక్టు పరిధిలోని ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నీటి విడుదల మరియు నిర్వహణ ప్రక్రియలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.




