Khammam: డా. జగదీష్ మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం!

Khammam: రోడ్డు ప్రమాదంలో మమతా ఆసుపత్రి ప్రముఖ న్యూరో సర్జన్ డా. జగదీష్ మృతి చెందడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 20 Sept 2026 11:39 AM IST
Khammam
X

Khammam: డా. జగదీష్ మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం!

Khammam: ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మమత ఆసుపత్రి వైద్యుడు, న్యూరో సర్జన్ గా సేవలందిస్తున్న డా. జగదీష్ మృతి చెందడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

డా. జగదీష్ మృతి వైద్య రంగానికి, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మాజీ పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.